గోధుమ దోసలకు కావలిసిన పదార్తములు -
- గోధుమ పిండి - 1 గ్లాస్
- బియ్యoపిండి - 1/4 గ్లాస్
- జీలకర్ర - 1/4 tsp
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - కాల్చుకోవడానికి
మొదట గోధుమ పిండి,బియ్యం పిండి,ఉప్పు,జీలకర్ర అన్ని ఒక గిన్నలో
తీసుకొని నీరు పోసి కలుపుకోవాలి ,ఇలా నీళ్ళ గా వుండాలి
[కింద బొమ్మలో చూపించిన మాదిరి]
తరువాత పొయ్యి మీద పెన్నము పెట్టుకొని పెన్నము బాగా కాలినాక దోస
వేసుకోవాలి ఇలా ............
తరువాత నూనె వేసుకొని కాలినాక తిప్పుకొని , అటు పక్క కూడా కాలినాక తీసుకోవాలి ,అంతే
ఎంతో రుచికరమయిన గోధుమ దోసలు తయ్యార్.........
ఇప్పుడు దాని లోకి చట్నీ [దీనికి ఈ చట్నీ అయితేనే బాగుంటుంది గోదుమ
దోస కాస్త సప్పగా వుంటుంది కాబట్టి కాస్త కమ్మటి పుల్లుపుతో ఈ చట్నీ చాలా
బాగుంటుంది చేసి తిని చెప్పండి ]
చట్నీ కి కావలిసిన పదార్తములు :
- పుట్నాల పొడి [పప్పుల పొడి (ఉత్తది )] - 2 కప్స్
- పచ్చి మిరపకాయలు - 5
- పచ్చి కొబ్బెర [తురుము (or ) ముక్కలు] - 8
- ఉప్పు - రుచికి తగినంత
- పెరుగు - 1 1/2 కప్
- కొత్తిమీర - కాస్త
1. మిక్సీ లో కొబ్బెర పచ్చిది,ఉప్పు వేసి తిప్పుకోవాలి ;
2. తరువాత దీనిలోనే పచ్చి మిరపకాయలు,కొత్తిమీర వేసి తిప్పి తరువాత ;
3. ఈ (కచ్చ పచ్చగా)పేస్టు ను పెరుగు ఉన్న గిన్నలో వేసుకొని తరువాత ;
4. పప్పుల పొడి వేసి కలుపుకోవాలి , కావాలి అంటే నీళ్ళు కూడా వేసుకొని
కలుపుకోవాలి ;
5. తరువాత పక్కలో పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని తిరువాత వేసుకొని చట్నీలో వేసుకుంటే చట్నీ తయ్యార్ ...........................
ఇలా గోదుమ దోసలు చట్నీ తో తిని ఆనందించండి ..............................
No comments:
Post a Comment