కావలిసిన పదార్థములు =
- గోంగూర - 5 కట్టలు [ముందు రోజే కడిగి బట్ట మీద ఆర బెట్టుకోవాలి]
- ఉప్పు - సరిపడా
- నూనె - 3/4 cup
- ధనియాలు - 2 tsp
- మెంతులు - 2 tsp
- పచ్చిమిరపకాయలు - ఒక పిడికెడు [ కొన్ని వుఉర్లల్లో కారము ఎక్కువ మిర్చి వుంటుంది కాబట్టి చుఉసి వేసుకోండి ]
- వట్టి మిరపకాయలు - ఒక పిడికెడు [ సరిపడా ]
- ఎల్లిపాయలు [ తెల్ల గడ్డలు ] - 3 గడ్డలు
తాయారు చేసుకునే పద్దతి =
- మొదట పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు,ఒట్టి మిరపకాయలు,ధనియాలు,గోంగూర అన్ని విడి విడిగా వేయించుకొని పెట్టుకోవాలి .
- చల్లారినాక రోటిలో కానీ లేక మిక్సీ లోకాని సరిపడా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవలి.
- మల్ల పెన్నము పెట్టుకొని 1/2 cup నూనె వేసి కాగినాక ఎల్లిపాయలు బాగా వేగినాక మెoతులు వేసి తరువాత మొదట దంచుకున్న గోంగూర మిశ్రమము వేసుకొని బాగా వేయించుకొని [సన్న మంట మీద ] తీసి పక్కన పెట్టుకోవాలి
- చల్లారినాక ఈ పచ్చడి గాజు సీసాలో వేసి పెట్టుకోండి రుచి మారకుండ వుంటుంది .
No comments:
Post a Comment